కాంప్రమైజ్ కాని మహేష్, బన్నీ….. ఒకే రోజున రాబోతున్న సినిమాలు…..??

-

రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలైన సరిలేరు నీకెవ్వరు మరియు అలవైకుంఠపురములో రెండూ కూడా రాబోయే సంక్రాంతి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ పరంగా అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పటికే రెండు వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు లో నటిస్తుండడంతో, ఆ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. అలానే గతంలో బన్నీ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన జులాయి,

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు రెండూ కూడా మంచి సక్సెస్ సాధించి ఉండడంతో, ప్రస్తుతం తెరకెక్కుతున్న మూడవ సినిమా అయిన అలవైకుంఠపురములో తప్పకుండా విజయాన్ని అందుకుని, వారి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడం ఖాయం అని బన్నీ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ విధంగా మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న ఈ రెండు సినిమాల నుండి ఇప్పటికే టీజర్లు మరియు సాంగ్స్ బయటకు వచ్చి, వేటికవే ప్రమోషన్స్ పరంగా కూడా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇటీవల ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజున, అనగా 2020 జనవరి 12 రిలీజ్ కాబోతున్నట్టు అధికారిక ప్రకటన రావడం జరిగింది. అయితే ఆ విధంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడం వలన రెండిటికి ఓపెనింగ్స్ విషయమై కొత్త నష్టం ఏర్పడుతుందని భావించి,

కొద్దిరోజుల క్రితం ఇండస్ట్రీ లోని కొందరు పెద్దల సమక్షంలో ఇరు సినిమాల నిర్మాతలను కూర్చోబెట్టి కొంత సుయోధ్య కుదిర్చారని వార్తలు వచ్చాయి. దానితో సరిలేరు నీకెవ్వరు జనవరి 11న మరియు అలవైకుంఠపురములో జనవరి 12న రిలీజ్ చేసేలా ఒప్పందం కుదిరిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తమ సినిమాను ఒక రోజు ముందుకు జరిపి రిలీజ్ చేస్తునట్టు సరిలేరు నీకెవ్వరు యూనిట్ ఇప్పటివరకు తమ సినిమా పోస్టర్స్ లో కానీ, ప్రమోషన్స్ విషయంలో కానీ ఎక్కడా కూడా ప్రకటన చేయకపోవడంతో, అవన్నీ ఒట్టి మాటలేనని అంటున్నారు. కావున రెండు సినిమాలు కూడా జనవరి 12నే థియేటర్స్ లోకి వస్తున్నట్లు చెప్తున్నారు. మరి ఈ రెండు సినిమాల  రిలీజ్ ల విషయమై అసలు నిజానిజాలు తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందేనని తెలుస్తోంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news