బన్నీ, మహేష్ నిర్మాతల మధ్య ఆ స్థాయిలో రచ్చ జరుగుతోందా….??

-

ఇప్పటికే సంక్రాంతి సమయంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అలవైకుంఠపురములో సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక భరత్ అనే నేను, మహర్షి సినిమాల విజయాలతో మహేష్ బాబు కెరీర్ పరంగా మంచి జోష్ మీదుండగా, గత రెండు సినిమాలతో పెద్దగా విజయాలు అందుకోని బన్నీ, ఎలాగైనా అల సినిమాతో హిట్ కొట్టాలని మరింత కసిగా ఉన్నాడు. ఇక ఈ రెండు సినిమాల నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్లు సైతం ఆయా సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు పెంచడం జరిగింది.

మొదట్లో కొన్నాళ్ల క్రితం ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయని నిర్మాతలు డేట్స్ కూడా ప్రకటించారు. అయితే ఆ సమయంలో అలవైకుంఠపురములో, సరిలేరు నిర్మాతల మధ్య కొందరు సినీ పెద్దలు సయోధ్య కుదర్చడంతో సరిలేరును ఒకరోజు ముందుగా రిలీజ్ చేయడానికి ఆ సినిమా నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇక రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ తో వస్తుండడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా మంచి ఆసక్తితో ఎదురుచూడ సాగారు. అయితే రెండు రోజుల క్రితం రెండు సినిమాలకు థియేటర్స్ విషయమై కొద్దిపాటి సమస్యలు తలెత్తడంతో, ప్రస్తుతం బన్నీ, మహేష్ ల సినిమాల నిర్మాతలిద్దరూ కూడా తమ తమ సినిమాలను ఎవరికి వారు పోటా పోటీగా ఒకే రోజున రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు టాక్.

 

కొన్ని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ రెండు సినిమాలు జనవరి 10 లేదా 11న రిలీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతున్నట్లు చెప్తున్నారు. అలానే రెండు సినిమాల నిర్మాతలు కూడా ఏ మాత్రం తగ్గే పరిస్థితి లేదని, మేము తగ్గం అంటే మేము తగ్గం అంటూ, ఈ వివాదాన్ని మరింత రచ్చ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో, అసలు ఈ రెండు సినిమాలు ఏ డేట్ లో రిలీజ్ అవుతాయో తెలియక ఫ్యాన్స్, ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news