జగన్ నిర్ణయం తో కర్నూల్ లో సంబరాలు ??

-

మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ కర్నూల్ ప్రాంతానికి హైకోర్టు కేటాయించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు థాంక్యూ సీఎం అంటూ నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని కర్నూలు ప్రాంతంలో సంబరాలు చేస్తున్నారు.

భారీ ఎత్తున సామాన్య ప్రజలు కర్నూల్లో రోడ్డుపైకి వచ్చి రాయలసీమ అభివృద్ధికి పాటుపడుతున్న వైయస్ జగన్ను అందరూ ఆశీర్వదించాలని జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయని వికేంద్రీకరణ పేరుతో అంతటా అభివృద్ధి జరగడం నిజంగా రాష్ట్రం మరొకసారి విడిపోదని ఒక చోట మాత్రమే కాకుండా అంతటా అభివృద్ధి జరగాలని జగన్ వేస్తున్న అడుగులకు రాయలసీమ ప్రాంత ప్రజలే కాకుండా అందరూ అండగా ఉండాలని కర్నూల్ ప్రజలు కోరుతున్నారు.

మరోపక్క ఉత్తరాంధ్రలో కూడా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం పట్ల అందరూ ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి జరగాలంటే వైజాగ్ ప్రాంతంలో జగన్ రాజధాని పెట్టడం సరైన పరిష్కారమని ఉత్తరాంధ్ర వాసులు సీనియర్ రాజకీయ నేతలు జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news