మణిరత్నం మహేష్ తో చేస్తానన్న సినిమా ఇదే..!

-

సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన మణిరత్నం కొన్నాళ్లుగా కెరియర్ పరంగా చాలా వెనుకపడ్డారు. అయితే ఓకే కన్మణి (ఓకే బంగారం) సినిమాతో మాత్రం మళ్లీ తన సత్తా చాటాడు. ఆ తర్వాత చెలియా సినిమా కూడా నిరాశపరచింది. అలాంటి టైంలో మణిరత్నం తెలుగు, తమిళ భాషల్లో మహేష్, విజయ్ తో భారీ మల్టీస్టారర్ చేయాలని అనుకున్నాడు. మహేష్, విజయ్ ఎవరు ఆ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు.

అదే సినిమా నవాబ్ గా వస్తుంది. ఈమధ్య రిలీజ్ అయిన ట్రైలర్ చూసి మహేష్, విజయ్ ఎందుకు ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నారో అని డౌట్ పడుతున్నారు. శింభు, అరవింద సామి పాత్రల్లో మహేష్, విజయ్ లను అనుకున్నాడట. ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే మాత్రం కచ్చితంగా మహేష్, విజయ్ ఓ క్రేజీ సినిమా మిస్ అయ్యారని అనుకోవచ్చు. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాలో నటిస్తుంటే.. విజయ్ మురుగదాస్ డైరక్షన్ లో సర్కార్ సినిమా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news