వెయ్యి కాళ్ల మండపంపై హైకోర్టులో పిటిషన్

-

తిరుమల వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హైకోర్టులో పిటిషన్ వేశారు. నాటి చంద్రబాబు ప్రభుత్వంలో మండపాన్ని కూల్చివేయడం దారుణమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నాడు వ్యవహరించారని పిటిషన్ లో ఆమె పేర్కొంది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే అనేక సార్లు సంబంధిత అధికారుల దృష్టకి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే వెయ్యికాళ్ల మండపాన్ని పున:నిర్మిస్తామని రోజా పేర్కొన్నారు.

ఇప్పటికే హైకోర్టు వెయ్యి కాళ్ల మండపం నిర్మాణంపై  తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news