విజయ్ దేవరకొండ వెంటపడుతున్న మెగా ఫ్యామిలీ…!

-

గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ విజయ్ దేవరకొండ తో స్నేహం చేస్తున్న సంగతి తెలిసిందే. అతని సినిమా కార్యక్రమానికి చిరంజీవి వెళ్ళిన తర్వాత మెగా ఫాన్స్ అతన్ని ఎక్కువగా ఓన్ చేసుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విజయ్ ని తెలంగాణా స్టార్ గా గుర్తించారు రెండు రాష్ట్రాల ప్రేక్షకులు. తెలంగాణా నుంచి స్టార్ హీరోలు ఎవరూ లేకపోవడంతో అతను తెలంగాణా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనితో తెలంగాణాలో… అందరి హీరోల అభిమానులు విజయ్ ని సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు.

ఇక అప్పటి నుంచి అతనికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ పెరిగింది. దీనితో మెగా ఫ్యామిలీ అతనితో స్నేహం మొదలుపెట్టింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. నైజాంలో కొంత కాలంగా విజయ్ హవా నడుస్తుంది. అతనికి ఫాలోయింగ్ కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ని విజయ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇది తమ సినిమాలకు కలిసి వస్తుంది అనే భావనలో మెగా ఫ్యామిలీ ఉంది. అందుకే తమ కాంపౌండ్ లో ఒక సినిమా చేసేసారు అతనితో…

ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేయించడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఒక దర్శకుడితో ఈ కథకు సంబంధించి చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఇదే విషయాన్ని విజయ్ కి కూడా అల్లు అరవింద్ ఫోన్ లో చెప్పగా, విజయ్ ఓకే చేసాడట. కథ ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం దానికి తుది మెరుగులు దిద్దే పనిలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది మార్చ్ లో సినిమా మొదలుపెట్టి దసరా కానుకగా విడుదల చేస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news