‘మీర్జాపుర్‌’ నటుడి ఇంట విషాదం

-

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు పంకజ్‌ త్రిపాఠి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి, బావ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో బావ రాజేశ్‌ మృతి చెందగా, సోదరి సరితకు తీవ్ర గాయాలయ్యాయి. బిహార్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ‘‘రాజేశ్‌ – సరిత దంపతులు శనివారం సాయంత్రం బిహార్‌లోని గోపాల్‌ఘంజ్‌ జిల్లా నుంచి కారులో పశ్చిమ బెంగాల్‌కు బయలు దేరారు. దిల్లీ – కోల్‌కతా జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేశ్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. సరిత తీవ్రంగా గాయపడ్డారని, ఆమె కాలు కూడా విరిగిందని ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news