సీఎం జగన్ పై దాడిపై A2 దుర్గారావు సంచలన ప్రకటన !

-

సీఎం జగన్ పై దాడిపై A2 దుర్గారావు సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్ పై దాడి కేసుపై దుర్గారావు మాట్లాడుతూ…జగన్ పై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సతీష్ తో నాకు పరిచయం లేదు…సతీష్ తండ్రి తో నాకు పరిచయం ఉందని తెలిపారు. నేను టీడీపీలో ఉన్నాను కాబట్టి కేసులో ఇరికించే ప్రయత్నం పోలీసులు చేశారని వెల్లడించారు. నాకు రాయి దాడికి ఏ సంబంధం లేదు… దాడి చేసిన తర్వాత సతీష్ నాకు ఫోన్ చేసాడు అనటం అవాస్తవమన్నారు.

జగన్ బస్సు యాత్ర మా ఏరియాకు వచ్చినపుడు నేను డాబా కోట్ల సెంటర్ లో ఉన్నానని వెల్లడించారు. తర్వాత పక్కనే ఉన్న పార్టీ కార్యాలయం దగ్గరకు వెళ్ళినపుడు ఎవరో ఫొన్ చేసి దాడి చేసినట్టు చెప్పారు…దాడి నేనే చేయిస్తే ఊరు వదిలి పారిపోవాలి కదా అంటూ దుర్గారావు ప్రశ్నించారు. పోలీసులు పలు విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టీ దాడి చేసింది నేనే అని ఒప్పుకోవాలని అని ఇబ్బంది పెట్టారు…నేను అంగీకరించలేదన్నారు. చివరికి నేను ఏ తప్పూ చేయలేదని నన్ను నిన్న రాత్రి విడుదల చేశారు…160 నోటీసు ఇచ్చి విచారణకు సహకరించాలని కోరారని వెల్లడించారు. విడుదలైన తర్వాత బోండా ఉమని కలువలేదు…ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న నేను ఆయన్ని కలవనని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news