అఖిల్ డేరింగ్ నిర్ణ‌యం.. ఫ్యాన్స్‌కు పండ‌గే!

-

స్టార్ హీరో రేంజ్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటాయి అఖిల్ అక్కినేని సినిమాలు. ఆయ‌న ఇండ‌స్ట్రీకి ఓ స్టార్ హీరో అంచ‌నాల‌తోనే వ‌చ్చారు. అయితే అదృష్టం కాస్త క‌లిసి రాలేద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే ఈ హీరో చేసిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా మ‌నోడు ఎక్క‌డా త‌గ్గ‌కుండా పెద్ద డైరెక్ట‌ర్ల‌తోనే సినిమాలు చేస్తున్నాడు.

ఇప్ప‌డు బొమ్మ‌రిల్లు డైరెక్ట‌ర్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్‌. జూన‌19న విడ‌ద‌ల‌వుతోంది. ఇందులో పూజా హెగ్ధే హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేస్తారంటూ వార్త‌లొచ్చాయి.

తాజాగా ఈ అనుమానాల‌పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇందులో నిజం లేద‌ని, క‌రోనా త‌గ్గాక ఖ‌చ్చితంగా థియేట‌ర్ల‌లోనే వ‌స్తామంటూ స్ప‌ష్టం చేసింది. ఈ సినిమాపై చాలా అంచ‌నాలున్నాయి. హిట్ అయితే థియేట‌ర్ల‌లో ఎక్కువ వ‌సూళ్లు రాబ‌డుతుంది. అప్పుడు అఖిల్‌కు అది ప్ల‌స్ అవుతుంది. ఆయ‌న‌కు స్టార్ డ‌మ్ వ‌చ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబ‌ట్టి ఈ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news