నటుడిగా ధోనీ ఎంట్రీ.. ఆ సినిమాతో తెరపైకి

-

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్.. మహేంద్ర సింగ్ ధోనీ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవలే ఆయన ధోనీ ఎంటర్​టైన్మెంట్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో రూపొందిన తొలి చిత్రం ‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’. జులై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకి సంబంధించిన ఓ రూమర్‌ కోలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ధోనీ ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరవనున్నారట. నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా కాబట్టి దానితోనే ధోనీ వెండి తెరపైకి వస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేదు. ధోనీ నటించారా, లేదా? అంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

హరీశ్‌ కల్యాణ్‌, ‘లవ్‌టుడే’ ఫేమ్‌ ఇవానా జంటగా నటించిన ఈ చిత్రానికి రమేశ్‌ తమిళమణి దర్శకత్వం వహించారు. నదియా, యోగిబాబు, ఆర్‌.జె. విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అత్తాకోడళ్ల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news