మరోసారి ఆకట్టుకోనున్న లవ్​స్టోరీ జోడీ.. నాగచైతన్య 23లో సాయి పల్లవి

-

టాలీవుడ్​ టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లి కాస్త గ్యాప్ తర్వాత తాజాగా ఓ సినిమాకు సైన్ చేసింది. అయితే ఈ భామ మళ్లీ తన లవ్​స్టోరీ కో స్టార్ నాగచైతన్యతో జతకట్టబోతోంది. ఈ ‘లవ్‌స్టోరి’ జోడీ మరోసారి తమ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు ముందుకొస్తోంది. నాగచైతన్య 23వ చిత్రం గీతా ఆర్ట్స్‌లో రూపొందనున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్‌ నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు.

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో కొన్ని రోజులుగా కథానాయిక ఎంపిక కోసం కసరత్తులు చేసిన చిత్రబృందం బుధవారం అధికారికంగా సాయిపల్లవి పేరుని ప్రకటించింది. నాగచైతన్య, సాయిపల్లవి ఇదివరకు ‘లవ్‌స్టోరి’లో కలిసి నటించిన విషయం తెలిసిందే. అందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు రెండోసారి కలిసి నటించనున్నారు. సాయిపల్లవి ఇప్పటికే చిత్రబృందంతో కలిసింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. చై-సాయిపల్లవి ఈసారి తెరపై ఏ విధంగా మ్యాజిక్ చేయబోతున్నారోనని ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news