నాగార్జునా వద్దయ్యా ..అనిల్ వద్దయా ..?

-

అక్కినేని నాగ చైతన్య తమ్ముడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు అబ్బా ఏమున్నాడ్రా ..చైతూ కి చుక్కలే అనుకున్నారు. మనం సినిమాలో అఖిల్ క్లైమాక్స్ లో చూసిన అందరికి ఇదే అభిప్రాయం కలిగింది. అంతగా బిల్డప్ ఇచ్చి చూపించారు డైరెక్టర్ విక్రం కుమార్. కానీ తన మొదటి సినిమాతోనే తుస్సుమనిపించాడు ఈ అక్కినేని వారసుడు. నితిన్ నిర్మాతగా వి వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ పేరుతోనె అఖిల్ తో మొదటి సినిమాని రూపొందించారు. కాన్ని ఆ సినిమా దారుణంగా ఫ్లాపయింది.

 

అదే కాదు అఖిల్ ఇప్పటివరకూ మూడు సినిమాలలో నటించాడు. అయితే వాటిలో ఒక్కసినిమా కూడా అఖిల్ కు మంచి హిట్ ని ఇచ్చి నిలబెట్టలేకపోయింది. అయినా సరే తన ముద్దుల కొడుకుని హీరోగా నిలబెట్టడానికి నాగార్జున ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అఖిల్ తాజాగా రూపొందుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాతో రెడీ అవుతున్నాడు.

 

జీఎ2 పిక్చర్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆరెంజ్ డిజాస్టర్ తర్వాత భాస్కర్ కి ఛాన్స్ ఇచ్చిన నిర్మాతే లేరు. ఎట్టకేలకు నిర్మాత అల్లు అరవింద్ ని మళ్ళీ మంచి స్క్రిప్ట్ తో ఒప్పించి ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే అఖిల్ కు మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు అక్కినేని నాగార్జున నానా తంటాలు పడుతున్నారు.

అనిల్ రావిపూడి ఈమధ్యే మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మహేష్ బాబు కి కాస్త షాకిచ్చింది. అనిల్ కి అలవాటైన చప్పటి కామెడీతోనే సినిమాని చెడగొట్టాడన్న మాట వినిపించింది. దాంతో అనిల్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్నది క్లారిటి లేదు. అయితే నాగ్ అఖిల్ కోసం ఇప్పుడు ఈ డైరెక్టర్ ని సెట్ చేసే ప్లాన్ లో ఉన్నాడట. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం వద్దని సలహాలిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news