శ్రావణి సూసైడ్ కేసులో మరో ట్విస్ట్ !

-

సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు సీరియల్ లానే అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా శ్రావణి కేసులో వెలుగులోకి కొత్త ట్విస్టు వచ్చింది. తనని పెళ్ళి చేసుకోనని దేవరాజ్ చెప్పడంతోనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. జూన్ లో అతని పై కేసు పెట్టిన తరువాత దేవరాజుని శ్రావణి మరింత గాఢంగా ప్రేమించినట్టు తెలుస్తోంది. అయితే నిన్ను పెళ్లి చేసుకోనంటూ దేవరాజ్ కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. అదే విషయాన్ని మెసేజ్ రూపంలో శ్రావణి మొబైల్ కు దేవరాజు పంపినట్టు చెబుతున్నారు.

మెసేజ్ చూసి తీవ్ర ఆవేదనకు గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని తెలుస్తోంది. ఓవైపు దేవరాజు పెళ్లి చేసుకోను అని అనడం, మరో వైపు కుటుంబ సభ్యులు సాయి కృష్ణను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో మనస్థాపానికి గురైన శ్రావణ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో దేవరాజు, సాయికృష్ణలను ఇద్దరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎస్ ఆర్ నగర్ పోలీసులు అదుపులో ఈ ఇద్దరు ఉన్నారు. రేపు అరెస్టు చూపించి, రిమాండ్ కు తరలించనున్న ఎస్సార్ నగర్ పోలీసులు రేపు నిర్మాత అశోక్‌రెడ్ఠిని కూడా విచారించనునున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news