ప్ర‌భాస్ బాట‌లో నితిన్ కూడా..

-

 

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాట‌లో నితిన్ న‌డ‌వ‌బోతున్నాడు. గ‌త ఏడు నెల‌లుగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో సినిమా షూటింగ్‌ల‌న్నీ ఆగిపోయాయి. స్వ‌దేశంలో ఇటీవ‌లే అన్‌లాక్‌ ప్ర‌క్రియ‌లో భాగంగా కేంద్రం అనుమ‌తులు ఇవ్వ‌డంతో షూటింగ్‌లు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ న‌టిస్తున్న `రాధేశ్యామ్‌` షూటింగ్ కూడా మొద‌లైన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లో కంటే రియ‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేయాల‌ని చిత్ర బృందం ఇటీవ‌లే ఇట‌లీ వెళ్లింది.

గ‌త రెండు వారాలుగా అక్క‌డే కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే పాల్గొన‌గా ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఇదిలా వుంటే యంగ్ హీరో నితిన్ టీమ్ కూడా ప్ర‌భాస్‌ని ఫాలో అవుతోంది. నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం `రంగ్ దే`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభించారు. స‌క్సెస్‌ఫుల్‌గా ఓ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. తాజాగా ఈ టీమ్ ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌` టీమ్ త‌ర‌హాలో ఇట‌లీ వెళ్ల‌బోతోంది. అక్క‌డ నితిన్‌, కీర్తిసురేష్‌ల‌పై సాంగ్స్‌ని షూట్ చేయ‌బోతున్నారు. ఇందు కోసం ఈ నెల 26న ఈ చిత్ర బృందం ఇటలీ ప‌య‌నం కాబోతోంది. ద‌క్షిణాది నుంచి ఇట‌లీకి లాక్‌డౌన్ త‌రువాత షూటింగ్‌కి వెళ్లిన రెండ‌వ సినిమాగా `రంగ్‌దే` టీమ్ నిల‌వ‌బోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news