భారత సినీ ప్రియులకి హాలీవుడ్ దర్శకుడి సందేశం..

-

కరోనా కారణంగా సినిమా థియేటర్లన్నీ ఎనిమిది నెలలుగా తెరుచుకోలేదు. ప్రస్తుతం 50శాతం సీటింగ్ కెపాసిటీతో డిసెంబరు 4వ తేదీన థియేటర్లు తెరుచుకుంటున్నాయి. హాలీవుడ్ మూవీ టెనెట్ సినిమా ఇండియా థియేటర్లలో సందడి చేయనుంది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలీజ్ పూర్తి చేసుకుంది‌. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టఫర్ నోలన్, భారతీయ ప్రేక్షకులకి సందేశాన్ని ఇచ్చారు.

moo

నోలన్ మాటల్లో.. టెనెట్ సినిమా ఐమ్యాక్స్ అనుభవం కోస ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన లోకేషన్లలొ చిత్రీకరించడం జరిగింది. అందులో ముంబై కూడా ఉండడంతో సినిమా రిలీజ్ పై ఆసక్తిగా ఉన్నానని, సినిమా ఆద్యంతం మీరు ఎంజాయ్ చేస్తారని తెలిపాడు. కరోనా టైమ్ లో అత్యధిక అంచనాలతో రిలీజ్ అవుతున్న టెనెట్ మూవీ భారతీయ ప్రేక్షకులని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. అదే విధంగా, ఇండియన్ సినిమాలకి దారి చూపెడుతుందా లేదా అన్నది ఆసక్తికరం.

Read more RELATED
Recommended to you

Latest news