ఎన్టీఆర్ బయోపిక్.. నిత్యా మీనన్ లుక్ ఇదిగో

-

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీ క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఎన్.బి.కే ప్రొడక్షన్స్ లో నందమూరి బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను ఎన్.టి.ఆర్ కథానాయకుడుగా ఫస్ట్ పార్ట్.. ఎన్.టి.ఆర్ మహానాయకుడిగా సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నారు.

ఎన్.టి.ఆర్ మహానాయకుడి నుండి ఇప్పటికే ఎన్నో పోస్టర్స్ రిలీజ్ అవగా లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ నటించిన గుండమ్మ కథ సినిమా నుండి ఓ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సావిత్రిగా నిత్యా మీనన్ కనిపించడం విశేషం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటూ బుల్లోడుగా బాలయ్య.. బుల్లెమ్మగా నిత్యా మీనన్ కనిపించి అలరించారు.

ఇప్పటికే మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ లో సావిత్రిగా నిత్యా మీనన్ కనిపిస్తుంది. ఇద్దరు సహజ నటీమణులే ఎన్.టి.ఆర్ కథానాయకుడిలో కూడా సావిత్రమ్మగా నిత్యా అచ్చు గుద్దినట్టు కుదిరింది. ఇక బుల్లోడుగా బాలయ్య కూడా అలరించాడు. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా జనవరి 9న రిలీజ్ అవుతుండగా.. ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా జనవరి 24న రిలీజ్ ఫిక్స్ చేశారు. దీపావళి కానుకగా సావిత్రి లుక్ రివీల్ చేశారు ఎన్.టి.ఆర్ చిత్రయూనిట్.

Read more RELATED
Recommended to you

Latest news