BREAKING : తారకరత్న ఇంటికి ఎన్టీఆర్, విజయసాయిరెడ్డి

-

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న(40) గత 23 రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ శనివారం రోజున కన్నుమూశారు. ఇక తారక్ మృతి తో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అయితే, కాసేపటి క్రితమే బెంగళూరులోని నారాయణ హృదయాలయా ఆస్పత్రి నుంచి హైదరాబాద్ చేరుకుంది తారకరత్న భౌతికకాయం.

మోకిలలోని నివాసానికి తారకరత్న భౌతికకాయం చేరుకుంది. అభిమానుల సందర్శనార్థం రేపు ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం ఉంచనున్నారు. ఇక రేపు మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే, నందమూరి తారకరత్న ఇంటికి రావడంతో… ఆయన ఇంటికి ఎన్టీఆర్‌, విజయసాయిరెడ్డి, కళ్యాణ్‌ రామ్‌ చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news