‘‘రారా సామి’’ అంటూ రష్మికను మించి అదిరిపోయే స్టెప్పులేసిన వృద్ధురాలు..

-

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ పార్ట్ 1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది. ఇక ఈ చిత్రంలో మేనరిజమ్స్ జనాలను ఉర్రూతలూగించాయి.

ప్రతీ ఒక్కరు ఈ చిత్రంలోని పాటల డ్యాన్స్ స్టె్ప్స్, హీరో, హీరోయిన్స్ మేనరిజమ్స్ ఇమిటేట్ చేస్తూ వీడియోలు, ఇన్ స్టా రీల్స్ చేశారు. అవి సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. క్యూట్ బ్యూటి రష్మిక మందన చేసిన ‘‘రా రా సామి’’ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది.

రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అందులో రష్మిక మందన, అల్లు అర్జున్ ల డ్యాన్స్ మూమెంట్స్ జనాలకు బాగా నచ్చాయి. తాజాగా ఈ సాంగ్ కు ఓ వృద్ధురాలు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. చీరకట్టులో గోచీ పెట్టుకుని ఉన్న వృద్ధురాలు రష్మిక మందనను మించి స్టెప్పులేసింది. ఇక ఈమె డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

https://www.instagram.com/reel/CdC5GkGFj7B/?utm_source=ig_embed&ig_rid=a2273f3c-420f-4485-be51-d668c891fa20

Read more RELATED
Recommended to you

Latest news