మహేష్ ‘మహర్షి’ ఓవర్సీస్ క్రేజ్

-

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను హిట్ తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. 2019 ఏప్రిల్ 5 ఉగాది సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతుంది.

ఓవర్సీస్ లో మహర్షి సినిమా 16 కోట్లకు డీల్ క్లోజ్ చేశారని తెలుస్తుంది. 16 కోట్ల రాబట్టాలి అంటే మహర్షి ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ అందుకోవాలి. మహేష్ నటించిన భరత్ అనే నేను 2.5 మిలియన్ డాలర్స్ పైగా వసూళ్లను రాబట్టింది. మరి ఆ సినిమా వసూళ్లను మించి మహర్షి బిజినెస్ జరగడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news