దిల్‌రాజుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ డెడ్‌లైన్‌!

-

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందే కీల‌క ఘ‌ట్టాల‌ని షూట్ చేశారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ రీ స్టార్ట్ అయింది.

ప‌వ‌న్ మాత్రం ఇంకా షూట్లో పాల్గొన‌డం లేదు. రెండ‌వ వారం నుంచి ప‌వ‌న్ షూట్‌లో పాల్గొన‌బోతున్నార‌ట‌. ఇదిలా వుంటే ఈ చిత్రానికి చిత్ర బృందం రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించేసింది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రికి సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని ముందే నిర్ణ‌యించేశారు. ఇందు కోసం షూట్‌ని ఫాస్ట్‌గా పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ దిల్‌రాజుకు డెడ్‌లైన్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కి డ‌బ్బింగ్‌కి మొత్తం క‌లిపి 20 రోజులు మాత్ర‌మే కేటాయిస్తాన‌ని, అంత‌కు మించి కేటాయించ‌న‌ని ప‌వ‌న్‌ చెప్పేశార‌ట‌. ఈంతో దిల్ రాజు షూట్‌తో పాటు డ‌బ్బింగ్ ని అనుకున్న టైమ్‌లో పూర్తి చేయాల‌ని పక్కాగా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news