హీరో సుదీప్ కుటుంబానికి సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్

-

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్  తల్లి సరోజా కన్ను మూసిన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో సుదీప్ కి సోషల్ మీడియా వేదికగా పలువురు  సినీ ప్రముఖులు ధైర్యం చెబుతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్  స్పందించారు.

 

ఈ మేరకు ట్విట్టర్   (ఎక్స్) వేదికగా పోస్టు చేశారు. “నటుడు కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. సరోజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని సుదీప్ గారు చెప్పారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు  చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news