ట్రెండ్ ఇన్ : పవన్ కల్యాణ్ స్థాయి వేరు.. స్థానం వేరు.. ‘జల్సా’కు పధ్నాలుగేళ్లు..

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న అశేష అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలయిందంటే చాలు.. ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటారు. మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత ‘వకీల్ సాబ్’గా సినీ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఇటీవల ‘భీమ్లానాయక్’గా ప్రేక్షకులను పలకరించారు.

ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ చేస్తున్నారు. మరో వైపున పాలిటిక్స్ లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. మొత్తంగా జనసేనాని జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ఓ వైపున సినిమాలు మరో వైపున రాజకీయాలు రెండూ చేస్తున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబో లో వచ్చిన ‘జల్సా’ చిత్రం విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన అభిమానులు, నెటిజన్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా #PawanKalyan పవన్ కల్యాణ్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు అన్నట్లుగా పవన్ అశేష అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ‘ఆర్ఆరఆర్’ సినిమా రచయిత ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోలను జోడించి పోస్టర్లు పోస్టు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ వంటి కథానాయకుడితో సినిమా చేసే అవకాశం బహుశా భవిష్యత్తులో రావొచ్చని, అటువంటప్పుడు ఇంకొకరు అవసరం లేదని, ఆయన్ను పోలిన వ్యక్తి ఇంకొకరు లేరని విజయేంద్రప్రసాద్ చెప్పారు. ఈ విషయాన్ని పోస్టర్ రూపంలో పేర్కొంటూ పవన్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

‘జల్సా’ చిత్రానికి సంబంధించిన సీన్లు, పోస్టర్లు కూడా వైరల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. పవన్ కల్యాణ్ ప్రజెంట్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో పాటు ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్ ’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ రెండు పిక్చర్స్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశం స్టోరి అందిస్తు్న్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news