షార్ట్ ఫిల్మ్ తీయగలరా.. సోషల్ ఫిల్మ్ ఫెస్టివల్.. లక్ష బహుమతి

-

‘వెంకీమామ’, ‘ఓ బేబీ’, ‘గూడచారి’ వంటి హిట్ సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ని నిర్వహిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ని నిర్వహిస్తోంది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ నిభందనలను పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ ప్రత్యేకంగా ఇచ్చిన ఒక అంశం మీద షార్ట్ ఫిల్మ్ ని రూపొందించాలి. ఇందుకుగాను ఈ కాంటెస్ట్ ద్వారా ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌లను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నారు. మొత్తం మూడు ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ ని ఎంపిక చేసి అందజేయనున్నారు. మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండో బహుమతిగా యాబై వేల రూపాయలు, మూడో బహుమతిగా ఇరువై ఇదు వేల రూపాయలను అందజేయనున్నారు.

 

షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యూరేటర్ గా కృతి ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఇక జ్యూరి మెంబెర్స్ గా టాలీవుడ్ డైరెక్టర్స్ తేజ, హరీష్ శంకర్, నందిని రెడ్డి, వి.ఎన్.ఆదిత్య, బాలరాజశేఖరుని వ్యవహరిస్తున్నారు. ఇక షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఏప్రిల్ 18 2020 నుంచి మే 15 2020 మద్య జరిగి వుండాలి. ఈ షార్ట్ ఫిల్మ్ ని పంపాల్సిన ఆఖరు తేది మే 15. మే 22 మూడు ఉత్తమ లఘుచిత్రాల ఎంపిక చేసి వాటికి మే 31న అవార్డులను ప్రకటించనున్నారు.

 

ఈ కాంటెస్ట్ నిబంధనలు:
1. “ఎంపవర్‌మెంట్ ఆఫ్ అండర్ ప్రివిలైజ్డ్ వుమెన్” అనేది షార్ట్ ఫిల్మ్ టాపిక్. ఆర్థిక, సాంఘిక, సామాజిక అడ్డంకుల వల్ల మహిళలు పడే ఇబ్బందులు గురించి మాత్రమే షార్ట్ ఫిల్మ్ తియ్యాలి.
2. షార్ట్ ఫిల్మ్ నిడివి ఐదు నిమిషాలు లోపే వుండాలి. మీరు ఇంట్లో సేఫ్‌గా వుండి మీకు ఉన్న సౌక్యరాలతో మాత్రమే షార్ట్ ఫిల్మ్ చెయ్యాలి.
3. గవర్నమెంట్ లాక్‌డౌన్ రూల్స్ కచ్చితంగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గానీ, పీపుల్ మీడియా సోషల్ గానీ ఎంటువంటి భాద్యత వహించదు.
4. ఫోన్‌తో గానీ, DSLR కెమెరాతో గానీ షూట్ చెయ్యొచ్చు. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌ని [email protected] & [email protected]కి మెయిల్ చెయ్యండి. డబ్బింగ్ అవసరం లేదు, ఫోన్‌లో వాయిస్ రికార్డింగ్ క్యాలిటి సరిపోతుంది.

తెలుగు / ఇంగ్లీష్ / హిందీ భాషలలో ఈ లఘు చిత్రాలని తీయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news