పిజ్జా బాయ్ చేసిన పనికి షాక్.. అశ్లీల గ్రూపుల్లో నటి నంబర్

-

పిజ్జా డెలీవర్ బాయ్ చేసిన పనికి తమిళ నటి షాకైంది. పిజ్జా డెలీవరి కోసం వచ్చిన అతను చేసిన పని ఆమెకు తలనొప్పిని తెచ్చింది. వేధింపులు తట్టుకోలేకప పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇకపై ఎవ్వరూ ఇలా కాకుడదు..జాగ్రత్తగా ఉండంటూ అందరికీ సలహాలు ఇచ్చింది. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

మణిరత్నం అంజలి సినిమాలో బాలనటిగా పరిచమైంది గాయత్రి సాయి. తరువాత పలు చిత్రాల్లో నటించినా.. అంత గుర్తింపు రాలేదు. అయితే తాజాగా ఈమె వార్తల్లోకెక్కింది. పిజ్జా బాయ్ చేసిన పనే ఆమె తంటాలు తెచ్చింది. డెలీవరీ బాయ్ ఫోన్ నంబర్ అడిగితే ఇవ్వడమే ఆమె పాపమైంది. అతను ఆ ఫోన్ నంబర్‌ను తీసుకెళ్లి అశ్లీల గ్రూపుల్లో పెట్టాడని, అక్కడి నుంచి తనకు అసభ్యకరమైన సందేశాలు వస్తున్నాయని వాపోయింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ఆ డెలీవరీ బాయ్ ఫోటోను, వస్తున్న అసభ్యకరమైన సందేశాలను పోస్ట్ చేసింది. తన బాధను చెప్పుకుని చెన్నై పోలీసులను ట్యాగ్ చేసింది. దీంతో వారు రియాక్ట్ అయి.. ఈ కేసును మహిళా విభాగానికి బదిలీ చేసినట్టు పేర్కొన్నారు. తన ఫిర్యాదుపై స్పందించినందుకు థ్యాంక్స్ చెబుతూ.. ఇంకోసారి ఏ సంస్థ చేయకుండా ఉంటుందని అనుకుంటున్నట్లు తెలిపింది. ఎవ్వరూ కూడా తమ నంబర్‌ను ఇలా చెప్పకండని అందరికీ జాగ్రత్తలు చెప్పింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డెలివరీ బాయ్, పిజ్జా యాజమాన్యంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news