సల్మాన్‌ సినిమా కోసం.. పూజా హెగ్డే సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

-

ప్రస్తుతం వెండితెరపై యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హ‌వా న‌డుస్తుంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒకప్పుడు ఆఫర్స్ అందుకోవడానికె ఎంతగానో సతమతమైన ఈ భామ మొత్తంగా టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇటీవల ఆమె నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్‌గా నిలవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ భామకు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ త‌గిలింది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జోడీగా పూజా హెగ్డే ఎంపిక చేశారని తెలుస్తోంది. సల్మాన్ హీరోగా ‘కభి ఈద్ కభి దివాళి’ చిత్రం తెరకెక్కనుంది. సాజిద్ నడయాడ్వాలా నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఫర్హాదా సంజీ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇందులో పూజా అందాలకు పెద్దపీట వేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే పూజా ఈ సినిమా విష‌యంలో ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుందట.

అదేంటంటే.. ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుందట పూజా. వరుస అవకాశాలతో ఉన్న ఏ హీరోయిన్‌ అయినా తన పారితోషికాన్ని తగ్గించుకునేందుకు అంత ఆసక్తిని చూపదు. అంతేకాదు ఇక స్టార్ హీరో సినిమా అంటే ఖ‌చ్చితంగా మంచి రెమ్యునరేషన్‌నే డిమాండ్ చేస్తుంటారు హీరోయిన్లు. కానీ సల్లూ భాయ్ సినిమా అనే సరికి పూజా వెంటనే రెమ్యునరేషన్‌ను తగ్గించుకుందట. దీంతో అటు బాలీవుడ్‌లోనూ.. ఇలా టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news