ప్ర‌భాస్ `రాధే శ్యామ్` రిలీజ్ డేట్ ఫిక్స్‌.. పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్‌..!!

-

‘సాహో’ సినిమాతో ప్రేక్షకులను,అభిమానులను కొంతవరకూ నిరాశపరిచిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎన్నో జాగ్రత్తలు తీస్కొని తన 20వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక మొదట ‘జాన్’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ లేదా ‘ఓ డియర్’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు.

పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ చిత్రాన్ని వేసవి తర్వాత విడుదల చేద్దామని భావించినా.. భారీ హంగులతో రూపొందుతున్న కారణంగా షూటింగ్ ఆలస్యమవుతుండడంతో సమ్మర్ 2021కి వస్తే ఎలా ఉంటుందన్న భావన కూడా చేశారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్ర విడుదల ఈ ఏడాదే ఉండనుంది. అది కూడా పండగ సీజన్ అయిన దసరా సమయంలోనే ఉంటుందని తెలుస్తుంది. అక్టోబర్ 16ను విడుదల తేదీగా లాక్ చేశారట. రెగ్యులర్ బయ్యర్లకు కూడా ఈ సమాచారం వెళ్లినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ తేదీని ప్రకటించనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news