ఇప్పుడు ప్రభాస్ టార్గెట్ ‘కేజీఎఫ్ 2 వసూళ్ళు అంతే.!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాను వరసగా 5 సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు. ఇలాంటి లైనప్ ఏ స్టార్ హీరోకు సాధ్యం కాదు. ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తో  చేసిన’ఆది పురుష్’  ఈ సంవత్సరం లోనే రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా తర్వాత  ప్రస్తుతం తన దృష్టి అంతా రెండు ప్రాజెక్ట్ లపై పెట్టాడు. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’లో , మరియు ప్రోజెక్ట్ కె సినిమాలలో  నటిస్తున్న విషయం తెలిసిందే. సలార్ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగంలోకి  దించారు.ఈ విలన్‌ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్  కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు.

ఇందులోని యాక్షన్ ఎడిసోడ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయని ఇప్పటికే లీకులు అందుతున్నాయి. ఇక ఈ సినిమా లో క్లైమాక్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అని తెలుస్తోంది. దీని కోసం ప్రశాంత్ నీల్ కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసారట. ఈ సినిమా ను ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా వసూళ్ల పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. టాక్ ప్రకారం ఇది కేజిఫ్ 2 వసూళ్ల ను ఈజీగా క్రాస్ చేస్తుందని అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news