రాధేశ్యాం రిజల్ట్ తో ప్రభాస్ లో గుబులు… మారుతి సినిమాని పక్కన పెడుతారా..?

-

బాహుబలి, సాహో సినిమాలలో ఆలిండియా స్టార్ గా ఎదిగారు ప్రభాస్. బాహుబలి 1,2 ఇచ్చిన కిక్ తో వరసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. బాహుబలి నార్త్, సౌత్ ఆడియన్స్ ను ఫుల్లుగా ఆకట్టుకుంది. దీని తరువాత సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ‘సాహో’ సినిమా నార్త్ లో హిట్ అయినప్పటికీ.. సౌత్ తో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న సుజీత్ కు ఈ ప్రాజెక్ట్ అప్పగించి తప్పు చేశాడని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ‘ రాధేశ్యాం ’ మూవీ రిజల్ట్ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ స్టార్ గా ఎదిగిన.. ప్రభాస్ పూర్తిగా ఓలవ్ స్టోరీ చేయడం ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. దీనికి తోడు హస్తసాముద్రికం, డెస్టినీ, లవ్ అనే పాయింట్ల సినిమాను తీయడం.. దానికి ప్రభాస్ వంటి పెద్ద స్టార్ అవసరమా.. అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రభాస్ లుక్కు, పర్సనాలిటీకి ఓ రేంజ్ యాక్షన్ సన్నివేశాలను సగటు ప్రేక్షకుడు ఊహించుకుంటాడు. ‘ రాధేశ్యాం’ దీనికి పూర్తిగా విభిన్నం. జ్యోతిష్యంలో చాలా రకాలుగా ఉంటాయి కానీ మనదేశంలో హస్తసాముద్రికానికి పెద్దగా నమ్మకాలు లేవు. ఈ పాయింట్ పట్టుకుని లవ్, డెస్టనీ చుట్టూ ఓ కథను అల్లడం పెద్దగా ప్రేక్షకులకు ఎక్కలేదు. కేవలం ‘జిల్’ సినిమాతో పరిచయం అయిన రాధాకృష్ణ .. చేసింది తక్కువ సినిమాలే. అవి కూడా పెద్ద స్టార్లతో కాదు. అయినా అవకాశం ఇచ్చి ప్రభాస్ చేతులు కాల్చుకున్నాడని అనుకుంటున్నారు.

ప్రస్తుతం వరసగా ప్రభాస్ ‘ సలార్’, ‘ఆది పురుష్’, ‘ప్రాజెక్ట్ K’, ‘స్పిరిట్’ సినిమాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే. ఇదిలా ఉంటే డైరెక్టర్ మారుతితో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు ప్రభాస్. పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే పెద్దగా స్టార్లను హ్యండిల్ చేసిన అనుభవం లేని సుజీత్, రాధాకృష్ణలకు అవకాశాలు ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు ప్రభాస్. అయితే ఇంతకుముందు మారుతికి కూడా పెద్దగా స్టార్లతో సినిమాలు చేసిన అనుభవం లేదు. వెంకటేష్ తో బాబుబంగారం సినిమా తీస్తే.. అది పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ప్రభాస్ మరోసారి రిస్క్ చేస్తారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news