ప్రశాంత్ నీల్ రచించిన ‘బఘీర’ ట్రైలర్ రిలీజ్

-

సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో కన్నడ స్టార్ శ్రీ మురళీ హీరోగా.. సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బఘీర’. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని కూడా హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ కథ కావడం.. హోంబలే ఫిలిమ్స్ నిర్మించడంతో ఈ చిత్రం కూడా బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్ లోనే తెరకెక్కింది.

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ని పరిశీలించినట్టయితే.. అమ్మ దేవుడు ఎందుకు రామాయణం, మహాభారతం అని ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఎప్పుడు ఎందుకు రాడు..?  దేవుడు అన్నిసార్లు రాడు.. సమాజంలో పాపాలు మితిమీరినప్పుడు, మంచిని చెడు తొక్కేసినప్పుడు..  సమాజంలో కుళ్లు పెరిగినప్పుడు, మనుషులు మృగాళ్లు అయినప్పుడు ఆయన ఆ అవతారమెత్తుతాడు అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే.. యాక్షన్ మూవీలా కనిపిస్తోంది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకొని విలన్లను చంపడం వంటిది కేజీఎఫ్ సినిమాను గుర్తు చేస్తున్నాయి. ట్రైలర్ లో మ్యూజిక్, ఫైటింగ్ సీక్వెన్స్ లు హీరో ఎలివేషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 31న ‘బఘీర’ విడుదల కానుంది. 

Read more RELATED
Recommended to you

Latest news