జాతీయ అవార్డు గ్ర‌హీత‌ చిత్రంలో ప్రియ‌మ‌ణి

-

సామాజిక అంశాల నేప‌థ్యంలో వాస్త‌విక‌త‌కు ద‌గ్గ‌ర‌గా సినిమాలు చేస్తుంటారు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌. ప‌లు చిత్రాల‌కు గానూ ఆయ‌న జాతీయ పుర‌స్కారాల్ని ద‌క్కించుకున్నారు. ఆయ‌న తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `సైనైడ్‌`. క‌ర్ణాట‌క‌కు చెందిన ఫిజిక‌ల్ ట్రైనింగ్ టీచ‌ర్ సైనైడ్ మోహ‌న్ సైనైడ్ స‌హాయంతో 20 మంది మ‌హిళ‌ల‌ల్ని అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు.

అత‌ని క‌థ ఆధారంగా రాజేష్ ట‌చ్‌రివ‌ర్ `సైనైడ్‌` పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సైనైడ్ మోహ‌న్ క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇందులో జాతీయ స్థాయిలో ఉత్త‌మ న‌టిగా పేరు తెచ్చుకున్న ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఇన్వెస్టిగేష‌న్ అధికారిగా ఆమె పాత్ర వుంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు తెలిపాయి. ఎన్నారై బిజినెస్‌మెన్ ప్ర‌దీప్ నారాయ‌ణ మిడిల్ ఈస్ట్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news