టాలీవుడ్ చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా అలాగే ఇతర కారణాల వల్ల చాలామంది ప్రముఖ నటులు తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే…తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర చోటు చేసుకుంది. తాజాగా కోలీవుడ్ నటి, డైరెక్టర్, నిర్మాత జయదేవ్ (65) చెన్నైలో కన్నుమూశారు.
![producer Jayadev passed away in Chennai](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/10/producer-Jayadev-passed-away-in-Chennai.jpg)
గత కొంతకాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ మరణించారు. డాన్సర్ గా కెరీర్ ఆరంభించిన జయదేవి…. తర్వాత నటిగా పలు చిత్రాల్లో నటించారు. నలమ్ నలమగీయ, విలాంగు మీన్, పాశం ఒరువేషం చిత్రాలకు డైరెక్షన్ చేశారు. నిర్మాతగా మూడు చిత్రాలను నిర్మించారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ను ఇండస్ట్రీకి ఈమెనే పరిచయం చేశారు.