బాలయ్య కింగే… మెగా ఫ్యామిలీకి గట్టిగా ఇచ్చారు!

-

టాలీవుడ్ సినీ ప్రముఖుల మీటింగ్ పై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు! ఈ మీటింగ్ కు తనను పిలవలేదని.. ఆ విషయం గురించి తనకు తెలియదని మీడియాలో చూసి తెలుసుకున్నానని బాలయ్య అనడం.. ప్రభుత్వంతో ఏం చర్చలు జరుగుతున్నాయో తనకు తెలీదని.. తలసానితో కలిసి హైద్రాబాదులో భూములు పంచుకుంటున్నారా.. అని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నిర్మాత సి. కల్యాణ్ కాస్త సుతిమెత్తగా స్పందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిప్పులు చెరిగారు! బాలయ్య ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి ఎవరూ లేరని.. నోరు అదుపులో పెట్టుకోవాలని.. మీరు కింగ్ కాదు జస్ట్ హీరో అంతే.. ఎవర్ని ఎప్పుడు ఎక్కడికి పిలవాలో అందరికీ తెలుసు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సినీ నిర్మాత ప్రసన్న కుమార్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

ఈ మధ్య జరిగిన ఇండస్ట్రీ పెద్దల మీటింగ్ ఓ ప్రైవేట్ హౌస్ లో జరిగిన ప్రైవేట్ మీటింగ్ అని.. వాళ్ళకి ఇష్టమైన సభ్యులతో మాత్రమే జరిగిందని ఆరోపించారు. అనంతరం బాలయ్య వ్యవహారంపై స్పందించిన ఆయన… ”బాలయ్య ఒక స్టార్ హీరో.. ఒక ప్రొడ్యూసర్.. ఒక ఎగ్జిబిటర్.. ఒక డిస్ట్రిబ్యూటర్.. ఒక టెక్నీషియన్.. మొత్తంగా ఆయన ఒక వ్యవస్థ. అలాంటి వ్యక్తికి ఇండస్ట్రీ పెద్దల మీటింగ్ కి పిలవకపోవడం చాలా బాధాకరమని” అని అభిప్రాయపడ్డారు! ఈ సందర్భంగా గతాన్ని గుర్తుచేసి, పునాదులను మరిచిపోవద్దన్నట్లుగా నేటి హీరోలకు సూచనలు చేసిన ఆయన… మద్రాస్ నుండి ఇండస్ట్రీ ఇక్కడికి తరలిరావడంలో చిరంజీవి అప్పట్లో కొన్ని అభ్యంతరాలు తెలిపారని.. అలాంటిది ఇప్పుడు రాళ్ళూ రప్పలు ఉన్న చోట అద్భుతమైన స్టూడియోలు నిర్మించిన వారిని పక్కన పెట్టడం ఎంత వరకు కరెక్టని ప్రసన్న కుమారు ప్రశ్నిస్తున్నారు! ఈ ప్రశ్నలపై సినీ విశ్లేషకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోన్న సంగతి కాసేపు పక్కన పెడితే… ఈ స్పందన అనంతరం మెగా ఫ్యామిలీకి గట్టిషాకే ఇచ్చారు ప్రసన్న కుమార్!

గతంలో పవన్ కళ్యాణ్ కి సమస్య వస్తే మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్.. ఇలా మొత్తం మెగా ఫ్యామిలీ హీరోలంతా వచ్చి ఫిలిం ఛాంబర్ ముందు కూర్చున్నారని.. ఆ రోజు తెలిసిన ఛాంబర్ ప్రాముఖ్యత ఇప్పుడు మాత్రం ఎందుకు గుర్తుకు రాలేదు అని ప్రశ్నించారు. బాలయ్యతో పాటు ఎంతో మంది సీనియర్స్ ని అవమానిస్తూ జరిగిన ఆ ప్రైవేట్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రసన్న కుమార్ సూటిగా ప్రశ్నించారు! ఈ సందర్భంగా “బాలయ్య కింగేమీ కాదు.. జస్ట్ హీరో మాత్రమే” అని నాగబాబు అనడంపై మాట్లాడిన ఆయన “బాలయ్య కింగే” అని అన్నారు! దీంతో ఈ వ్యవహారంపై బాలయ్య వైపునుంచి బలమైన సమాధానమే వచ్చిందని కొంతమంది అంటుండగా… ప్రసన్న కుమార్ మాటల్లో న్యాయముందని, ఆయన ప్రశ్నల్లో అర్ధముందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news