పోలవరం పై చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కేంద్రం ఎదుట మరో కొత్త ప్రతిపాదన..!

-

దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయల్దేరి వెళ్లారు. శనివారం జరగబోయే నీతి అయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పోలవరంలో మరో డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు చేయనున్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి సహకరిస్తామని బడ్జెట్ సమావేశంలో కేంద్రప్రభుత్వం ప్రస్తావించింది. దీంతో పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది.

 

గతంలో 2014-19 మధ్యలో నిర్మించిన డయా ఫ్రమ్ వాల్.. జగన్ హయాంలో ధ్వంసమైందని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టులో మరో డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించారు. సాధ్యాసాధ్యాలపై కమిటీని నియమించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే చంద్రబాబుకు ఆ నివేదికను సైతం కమిటీ అందజేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతోం

Read more RELATED
Recommended to you

Latest news