లారెన్స్ కోసం రంగలోకి రజినీ.. అజిత్, విజయ్ స్పందింస్తారా?

-

రాఘవ లారెన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతగా ఇలా అన్నింటా సక్సెస్ అయిన లారెన్స్ మంచి మనసును చాటుకుంటూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సేవా కార్యక్రమాల్లో ముందుంటూ.. కేవలం సినిమాల్లో చూపించడమే కాదు నిజ జీవితంలోనూ పాటిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అనాథ పిల్లలను చేరదీయడం, వృద్దులకు వికలాంగులకు సాయం చేయడం, ఉచితంగా ఆపరేషన్‌లు చేయించడం అందరికీ తెలిసిందే. ఈ కరోనా కష్టకాలంలోనూ లారెన్స్.. మూడు కోట్ల విరాళాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సొంత ఊరి కోసం, సినీ పరిశ్రమ కోసం, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేసి అందరి మనుసులను గెలుచుకున్నాడు. ఇంకా ఏదో చేయాలని పరితపిస్తూనే ఉన్నాడు.

అయితే ఇంత పెద్ద కార్యక్రమాన్ని తానొక్కడే చేయలేనని భావించి కోలీవుడ్ స్టార్ హీరోలను అభ్యర్థించాడు. రజినీ, కమల్, అజిత్, విజయ్, సూర్య వంటి హీరోలను ఆర్థిక సాయం చేయాలని కోరాడు. ఇందులో భాగంగా రజినీకాంత్ వంద బస్తాల బియ్యాన్ని పంపించాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు లారెన్స్. అంతేకాకుండా అందరి హీరోల ఫ్యాన్స్‌ను కూడా అభ్యర్థించాడు. ఎవరికి తోచిన మొత్తాన్ని వారు విరాళంగా ఇవ్వండని విన్నవించుకున్నాడు. మరి వీరంతా ఏమేరకు స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news