వలస కూలీల కోసం ఏపీ మార్గదర్శకాలు ఇవే…!

-

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పెంచడం తో వలస కార్మికులను ఎక్కడి వారిని అక్కడికి తరలించడానికి రాష్ట్రాలు సిద్దం అయ్యాయి. ఈ నేపధ్యంలో ఏపీకి చెందిన వాళ్ళు కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావడానికి సిద్దమయ్యారు. ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ పనుల కోసం వెళ్ళారు. వారిలో విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల వారు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

ఏపీలో ఇతర జిల్లాల్లో ఉన్న వలస కార్మికులు 1902కి ఫోన్ చేసి తమ వివరాలు చెప్పాలని పేర్కొంది. గ్రీన్ జోన్‌లో ఉన్నవారు మాత్రమే గ్రీన్ జోన్‌కి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పింది. రిలీఫ్ క్యాంప్‌లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలని చెప్పింది. రాండమ్‌గా (అందరిలో కొందరికి) పరీక్షలు చేస్తారు. పరీక్షల్లో నెగటివ్ వస్తే వారిని బస్సులో 50 శాతంకు మించకుండా తరలిస్తారని ప్రభుత్వం చెప్పింది.

స్వగ్రామాల్లో 14 రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉండాల్సి ఉంటుంది. తర్వాత మరో 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాలి. పాజిటివ్ వస్తే ఉండాలి. ఆ తర్వాత మరో 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్ ఉండాలి.- పరీక్షల్లో పాజిటివ్ వస్తే… ఆ వ్యక్తితో ఉన్న గ్రూపు మొత్తాన్నీ అక్కడే ఉంచుతుంది ప్రభుత్వం. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్తారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో ఏపీ అధికారులు సమన్వయం చేసుకుని…

ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, ఒక రైల్వే‌స్టేషన్‌ని గుర్తి౦చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఆ జిల్లాలో గుర్తించిన రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్ చేరుకోవాలి. ఆ విధంగా వచ్చిన వారికి స్క్రీనింగ్ ఉంటుందని… పూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు ఉంటాయని… ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించి ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటెన్‌ కేంద్రానికి పంపి౦చి అనంతరం పరిక్షలు జరిపి నెగటివ్ వస్తే ఇంటికి పంపుతారు.

Read more RELATED
Recommended to you

Latest news