గీత మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న రాజమౌళి

-

ఛలో, గీతా గోవిందం చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో కన్నడ భామ రష్మిక మందన్నకు తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టేసరికి అమ్మడి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ లో ఒక హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీగా ట్రిపుల్ ఆర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈమధ్యనే ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. రష్మికతో పాటుగా కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ నుండి మాత్రం అఫిషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి అనుకున్న డేట్ కు రాజమౌళి తెస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news