నవ్వుతూ కరోెనాతో పోరాడండి.. రకుల్ పోస్ట్ వైరల్

-

కరోనా వైరస్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఇంతవరకు దానికి విరుగుడు కనుక్కోలేకపోవడం, రోజురోజుకు దాని ప్రభావం పెరుగుతూ ఉండటంతో మానవాళిలో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. మనదేశంలో దాదాపు 137 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికి మన రాష్ట్రంలో ఐదుగురికి కరోనా లక్షణాలు బయట పడ్డాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రజలంతా కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, కరోనా సోకకుండా ఉండేందుకు పాటించాల్సిన నియమాలు, సలహాలు, సూచనలు ప్రభుత్వం ఇస్తోంది. అంతేకాకుండా సినీ ప్రముఖులంతా ఈ కరోనాపై అవగాహన కలిగించేందుకు నడుం బిగించారు. తాజాగా ఈ జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ చేరింది.

 

‘దయచేసి ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతే తప్పా..ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టకండి.. ఈ రోజు షూటింగ్‌ను వాయిదా వేయలేకపోయాము.. అయితే అన్ని జాగ్రత్తలను తీసుకుని షూటింగ్ పూర్తి చేశాము..ఎవ్వరూ ఆందోళన చెందకండి తెలివిని ప్రదర్శించండి..పాజిటివ్‌గా ఆలోచించండి.. నవ్వుతూ కరోనాతో పోరాడండ’ని పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news