RRR కు చరణ్ బ్రేక్..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓ పక్క వినయ విధేయ రామ సినిమా చేస్తూనే రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో కూడా జాయిన్ అవుతున్నాడు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న రాం చరణ్ డిసెంబర్ 7 నుండి 9 వరకు శబరిమల వెళ్లి వస్తాడని తెలుస్తుంది. అందుకే ట్రిపుల్ ఆర్ కు ఓ చిన్న బ్రేక్ ఇచ్చాడని తెలుస్తుంది. శబరి నుండి రాగానే వినయ విధేయ రామ కోసం ఓ సాంగ్ చేయాల్సి ఉందట. అది పూర్తి చేసే సినిమా పూర్తవుతుందని తెలుస్తుంది.

2019 సంక్రాంతి బరిలో దిగుతున్న విధేయ రామ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బోయపాటి శ్రీను సినిమా పూర్తి చేశాక మళ్లీ రాజమౌళి ట్రిపుల్ ఆర్ కోసం డేట్స్ కేటాయిస్తాడని తెలుస్తుంది. మొత్తానికి టైట్ షెడ్యూల్ తో రాం చరణ్ ఫుల్ బిజీ అయ్యాడని చెప్పొచ్చు. ఇవే కాదు మరోపక్క తను నిర్మిస్తున్న సైరా సినిమా బాధ్యతలను కూడా సరిచూస్తున్నాడు రాం చరణ్. స్టార్ హీరోగా ఓ పక్క సినిమాలతో పాటుగా నిర్మాతగా చరణ్ వయసుకి మించిన బాధ్యత మీద వేసుకున్నాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news