మోడీని ఆయ‌నే ఓడిస్తారు..

-

ప్రధాని మోడీని అల్లా ఓడిస్తాడని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఈ దేశం కేవలం మీదేనా? నాది కాదా? స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నంగా ఉన్న ఈ దేశంలో మోదీ, ఆర్‌ఎస్సెస్, యోగిలకు వ్యతిరేకంగా మాట్లాడితే… వాళ్ల విధానాలను విమర్శిస్తే.. దేశం నుంచి తరిమేస్తారా? అంటూ ఓవైసీ ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఎంఐఎం నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే

తెలంగాణలో భాజ‌పా అధికారంలోకి వ‌స్తే, నిజాం హైదరాబాద్ వదిలి వెళ్లినట్టుగానే.. ఎంఐఎం నేతలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేస్తామని యోగి హెచ్చరించడంతో అస‌దుద్దీన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో రాష్ట్రాల‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారంటూ ఆయ‌న ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news