వరుణ్ సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు..!

-

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ఘాజి సినిమాతో సక్సెస్ అందుకున్న సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా అంతరిక్షం. లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అటెండ్ అయ్యారు.

అంతరిక్షం గురించి చరణ్ ఏమన్నాడు అంటే.. వరుణ్ తన ప్రతి సినిమాతో సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడని.. అతన్ని చూస్తే కొన్ని సార్లు అసూయ, జలస్ అనిపిస్తుందని అన్నారు చరణ్. ఇక సంకల్ప్ రెడ్డి ఆలోచన గొప్పదని. ఆయన చూస్తే అలా కనిపించరు కాని ఆయన ఆలోచన చాలా గొప్పదని అన్నారు. ఆ కటౌట్ కు విజన్ కు సంబంధం లేదని అన్నారు. రాజమౌళి, సుకుమార్, క్రిష్ వారి చెంత సంకల్ప్ రెడ్డి చేరుతాడని.. వారి కంటే గొప్ప సినిమాలు తీయాలని అన్నారు చరణ్.

భయం మనల్ని వెనుకడుగు వేసేలా చేస్తుంది. అలా భయపడే పని ఆరోజు ముగిస్తే విజయం సొంతం అవుతుందని మొన్న బాబాయ్ చెప్పిన మాటలు గుండెల్లో దూసుకెళ్లాయని అన్నారు చరణ్. వరుణ్ పాజిటివిటీ వల్లే అలాటి ఆలోచన ఉన్న పది మందిని తన దగ్గరకు తెచ్చి మంచి సినిమాలు చేసేలా ప్రేరేపిస్తుందని చరణ్ అభిప్రాయపడ్డారు. తప్పకుండా అంతరిక్షం మెగా అభిమానులకు, సిని అభిమానులకు నచ్చుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news