అంజనా దేవి ముందు అత్తను అడ్డంగా బుక్ చేసిన ఉపాసన.. వీడియో వైర‌ల్

-

టాలీవుడ్ అగ్ర‌న‌టుడు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవ‌ల ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ పేరుతో ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్‌ షురూ చేశారు.  రెడీ మిక్స్‌ రూపంలో తన సిగ్నేచర్ వంటకాలను అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ కిచెన్ గురించి ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ స‌మ్మ‌ర్ స్పెషల్‌లో భాగంగా సురేఖ తాజాగా మామిడికాయ ప‌చ్చ‌డి పెడుతుండ‌గా.. ఆమె కోడ‌లు ఉపాసన ఒక్క ఫ‌న్నీ వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు.

చిరంజీవి త‌ల్లి అంజనా దేవి పర్యవేక్షణలో సురేఖ మామిడికాయ ప‌చ్చ‌డి పెడుతుండ‌గా.. ఉపాసన అంజనా దేవి ద‌గ్గ‌రికి వెళ్లి.. నాయనమ్మ మీరు ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారు. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయడం లేదా?’’ అని ఉపాసన అడగ్గా.. ప‌ని లేక ఖాళీగా కుర్చున్నా అని అంజనా దేవి సమాధానమిచ్చారు. ఆ త‌ర్వాత కెమెరా సురేఖ వైపు తిప్పి అత్తమ్మా అని పిలువ‌గా.. సురేఖ ఏమి చేస్తున్నారు అని అడగ్గా..  ఊపాస‌న క్యా హోరా అని తిరిగి ప్రశ్నించారు. అప్పుడు సురేఖ నాకు హిందీ రాదు అంటూ సురేఖ సమాధానమిచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)

Read more RELATED
Recommended to you

Latest news