వైసీపీలో నాకు చాలామంది తన అభిమానులు ఉన్నారు : పవన్ కళ్యాణ్

-

తూ.గో జిల్లా లో వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం కావాలి.. పిఠాపురంలో వర్మ, నేను పోటీ చేస్తున్నాం.. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ.. సమిష్టి నాయకత్వంతో పిఠాపురంలో పనిచేస్తున్నాం.. కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. వర్మ లేకుండా కాదు వర్మతో కలిసి పిఠాపురంలో పనిచేస్తున్నాం.. ఒక ఎన్నిక కోసం పిఠాపురం రాలేదు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

వైసీపీలో చాలామంది తన అభిమానులు ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. మన రాష్ట్రాన్ని పరిపాలించే మహారాణి వెళ్ళిపోవాలని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జక్కంపూడి కుటుంబం పై తనకు గౌరవం ఉందన్నారు. రాజానగరం నియోజకవర్గం గంజాయి, ఇసుక అక్రమ తవ్వకాలుకు అడ్డగా మారిందని విమర్శించారు. బలమైన బవిష్యత్తు ఇవ్వటానికి వచ్చానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ సర్వనాశనం అవుతుందని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news