చంద్రబోస్‌ను సవాల్ చేసిన రామజోగయ్య శాస్త్రి

-

ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అందరికీ తెలిసిందే. అది మెల్లిగా పాకి పెద్ద ఉద్యమంలా తయారైంది. సినీ సెలెబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ అందరూ తమ వంతుగా మొక్కలు నాటుతున్నారు. రోజా అయితే ఏకంగా రోజా వనం అనే పేరిట మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ వనంలో సెలెబ్రిటీలతో మొక్కలు నాటిస్తూ అందరికీ స్ఫూర్తి కలిగేలా చేస్తోంది.

ఈ ఉద్యమంలో ఇప్పటికే స్టార్ హీరోలు, హీరోయిన్లు, అనేక స్వచ్చంద సంస్థలు పాల్గొన్నాయి. ఈ ఉద్యమంలో రోజా తన వంతుగా అనసూయ, రష్మీ, అర్జున్, కుష్బూ వంటి వారిని భాగస్వామ్యం చేసింది. వారు కూడా తమ స్నేహితులకు ఈ చాలెంజ్‌ను విసిరారు. మహానటి కీర్తి సురేష్ సైతం మొక్కలు నాటి తన వంతు బాధ్యతను నెరవేర్చింది. తాజాగా పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి సైతం ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ, ఎంపీ సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా చంద్రబోస్, తమన్, రాజ్ తరుణ్‌లకు గ్రీన్ ఇండియా సవాల్‌ను విసిరాడు. మరి వీరు స్పందించి ఇంకా ఎవరికీ చాలెంజ్ విసురుతారో చూడాలి. తాను నాటిన మొక్కతో సెల్ఫీ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ పాటల రచయిత.

Read more RELATED
Recommended to you

Latest news