షాకిస్తున్న ర‌ష్మిక రెమ్యున‌రేష‌న్‌!

-

ర‌ష్మిక మంద‌న్న‌.. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి `ఛ‌లో` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి చిత్రంతో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ర‌ష్మిక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హాట్ ఫేవ‌రేట్‌గా నిలిచింది. ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ రాజ‌మండ్రి స‌మీపంలోని మారేడు మిల్లిలో ప్రారంభ‌మైంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ ఏడాది ప్రారంభంలో మ‌హేష్‌ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుంది. దీంతో ర‌ష్మిక ఒక్కో చిత్రానికి 2 కోట్లు డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

కాజ‌ల్ కోటిన్న‌ర డిమాండ్ చేస్తుంటే స‌మంత‌, పూజా హెగ్డే 2 కోట్లకు పైనే అడుగుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ జాబితాలో ర‌ష్మిక చేరింది. `పుష్ప‌`తో పాటు ర‌ష్మిక చేతిలో కార్తి హీరోగా న‌టిస్తున్న త‌మిళ చిత్రం `సుల్తాన్‌`, శ‌ర్వానంద్ హీరోగా తెర‌పైకి రానున్న `ఆడాళ్లూ మీకు జోహార్లు` చిత్రాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news