నేడు రాంలీలా మైదానంలో రావణ దహనం.. హాజరుకానున్న ప్రభాస్

-

ప్రతి ఏటా దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమం జరగడం ఆనవాయితీ. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి రావణ దహనం కార్యక్రమానికి టాలీవుడ్ హీరో ప్రభాస్ ను కూడా నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ తో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాంలీల మైదానంలో రావణ దహనానికి హాజరు కావాలంటూ ఆయనకు రామ్ లీలా కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానం మేరకు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఉన్న ప్రభాస్ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Latest news