రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్ వచ్చేసింది

-

మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లో రవితేజ లుక్, యాక్షన్ సీన్స్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. స్టువర్టుపురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు ఈ కథ సాగుతుంది. ఈ నెల 20న సినిమా విడుల కానుంది. 

తాజాగా విడదలైన ట్రైలర్ లో గుంటూరు రైల్వే స్టేషన్ దేవుడి పాట 25000 అంటూ వేలం పాట జరుగుతుంది. దొంగతనానికి కొన్ని ఉండాలి. ముఖ్యంగా ధైర్యం ఉంటే సరిపోదని.. తెలివితేటలు కూడా ఉండాలనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. నీటి మధ్యలో రైలు వెళ్లడం ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించేవిధంగా కనిపిస్తోంది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Read more RELATED
Recommended to you

Latest news