కిల్లర్ గా రవితేజ .. హీరోయిన్స్ గా నిధీ అగర్వాల్, మాళవిక శర్మ .. ట్విస్టేంటో తెలుసా ..!

-

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం క్రాక్‌. డాన్‌ శీను, బ‌లుపు లాంటి కమర్షియల్ సక్సస్ ల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈ ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కోసం కసితో ఈ సినిమాని చేస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ తో భారీ అంచనాలు ఉన్నాయి. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ సినిమా సక్సస్ ఎంతో కీలకం. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే వరలక్ష్మీ, సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

 

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ మరో సినిమా చేయడానికి రంగం సిద్దం అవుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని తాజా సమాచారం. అంతేకాదు రవితేజ చేస్తోన్న రెండు పాత్రల్లో ఒక పాత్ర కిల్లర్ అని.. మరో పాత్ర పోలీస్ అని విశవసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం… మరో హీరోయిన్ గా మాళవిక శర్మను తీసుకోనున్నారని త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.

 

ఇంతకముందు నేల టిక్కెట్టు సినిమాలో మాళవిక రవితేజ సరసన నటించింది. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ బ్యూటి కనిపించలేదు. మళ్ళీ ఇదే సినిమాలో నటించబోతుంది. ఇక ఇక్కడ ట్విస్టేంటంటే ఈ సినిమా రీమేక్ అని తమిళంలో ఇంకా రిలీజ్ కానీ ఒక తాజా సినిమానే తెలుగులో రవితేజ చేయబోతున్నాడని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవమెంతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news