తన ఫ్యాన్స్ కు వెన్నుపోటు పొడిచి చంపేసాడు – పవన్‌ పై RGV సీరియస్‌

-

తన ఫ్యాన్స్ కు వెన్నుపోటు పొడిచి చంపేసాడని ఓ రేంజ్‌ లో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై RGV సీరియస్‌ అయ్యారు. నిన్న మీడియాతో పొత్తులపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామని ప్రకటన చేశారు పవన్‌.

ఉనికి చాటుకోవడానికి పార్టీ పెట్టలేదు.. లోతుగా ఆలోచించే గతంలో టీడీపీకి సపోర్ట్ చేశాను.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని తేల్చి చెప్పారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అయితే.. దీనిపై RGV కౌంటర్‌ ఇచ్చారు. ఆ రోజు NTR ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు… తన జనసైనికులు, తన ఫ్యాన్స్ కు వెన్నుపోటు పొడిచి పవన్‌ కళ్యాణ్‌ చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్‌ చేశారు. తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడంటూ మండిపడ్డారు ఆర్జీవీ. మరి దీనిపై పవన్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news