చిత్రలహరి టీజర్.. బాధపడకు బాబాయ్ నీకు ఓ మంచి రోజు వస్తుంది.. సాయి ధరం తేజ్ కొట్టేలా ఉన్నాడు..!

-

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది. టీజర్ ఇంప్రెస్ చేయడమే కాదు సాయి ధరం తేజ్ కు హిట్టు ఇచ్చేలా ఉంది. దూరదర్శన్ లో శుక్రవారం వచ్చే చిత్రలహరిలో పాటలు.. అయితే ఈ చిత్రలహరిలో కొన్ని పాత్రలు ఉంటాయి.

వాయిస్ ఓవర్ తోనే మొదలైన ఈ సినిమా టీజర్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. చివర్లో సుదర్శన్ తేజూతో బాధపడకు బాబాయ్ నీకు ఓ మంచి రోజు వస్తుంది అంటూ చెబుతాడు. ఆ వచ్చేదేదో ఆదివారం రమ్మను బాబాయ్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటానని తేజూ చెబుతాడు. టీజర్ చూస్తేనే సాయి ధరం తేజ్ కు పక్కా హిట్ వస్తుందని అనిపిస్తుంది. నేను శైలజా, ఉన్నది ఒకటి జింగది సినిమాలతో సత్తా చాటిన కిశోర్ తిరుమల చిత్రలహరి ఏం చేస్తాడో చూడాలి. ఈ సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news