NTR 30 లో సాయి పల్లవి..!

-

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో తన 30వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధా ఆర్ట్స్ కలసి నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ఇక సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించినది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజర్ గా ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఉన్నా సరే కథ ప్రకారం మరో హీరోయిన్ అవసరం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ పాత్రలో సాయి పల్లవిని సెలెక్ట్ చేశారని సమాచారం. ఇక ఎన్టీఆర్ 30లో సాయి పల్లవి అవకాశం దక్కించుకుందని తెలిసి అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగులో ఫిదా సినిమా ద్వారా పరిచయమయ్యి అందరిని ఆకట్టుకుంది. ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది సాయి పల్లవి. ఇకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాన్ని దక్కించుకోవడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఆ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుంది. ముఖ్యంగా పాటల విషయంలో కూడా అంతే …అందుకే ఈమె ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉంటుంది .

ఇక మరొకవైపు ఎన్టీఆర్ కూడా మంచి డాన్సర్.. ఇప్పుడు ఆయన సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది.. అంటే ఈ ఇద్దరికీ కలిపి ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ కచ్చితంగా ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి అయితే ఎన్టీఆర్ 30వ సినిమా 2024 ఏప్రిల్ లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటినుంచి సినిమా షూటింగ్ పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news